Posted on 2025-11-03 20:07:15
ఈ ఘటన తనను తీవ్రంగా కలిసి వేసింది..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో చోటుచేసుకున్న బస్ ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ఘోర ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా నడిపే కంకర టిప్పర్ల వలన అమాయక ప్రజల ప్రాణాలు బలికావడం విచారకరమన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజమానుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి” అని కోరారు. అలాగే, రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి, నియంత్రణ లేని టిప్పర్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >