Posted on 2025-11-03 20:07:15
ఈ ఘటన తనను తీవ్రంగా కలిసి వేసింది..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో చోటుచేసుకున్న బస్ ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ఘోర ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా నడిపే కంకర టిప్పర్ల వలన అమాయక ప్రజల ప్రాణాలు బలికావడం విచారకరమన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజమానుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి” అని కోరారు. అలాగే, రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి, నియంత్రణ లేని టిప్పర్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >