కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడులకు భయపడం
గులాబీ సైనికుడు రాము నాయక్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఓరవలేకనే మణుగూరులో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం హేయమైన చర్య అని గులాబీ సైనికుడు రాము నాయక్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి మళ్లీ అధికారంలోకి బిఆర్ఎస్ పార్టీ రావడం తధ్యమని ,ఎన్ని దాడులు చేసినప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని ,ఇలాంటి దుస్థితిని తట్టుకోలేకనే కాంగ్రెస్ చేనులు టిఆర్ఎస్ కార్యకర్తలపై కార్యాలయాలపై దాడులకు ప్రతిచర్యగా ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.