Posted on 2024-01-08 21:24:11
డైలీ భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా బాకారం గ్రామ రెవెన్యూ లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపింది. కాగా.. మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు.
వారు వెంటనే మొయినా బాద్ పోలీసులకు సమా చారం అందజేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులు వచ్చే వరకు కూడా మహిళ మృతదేహం కాలుతునే ఉంది. మంటలను పోలీ సులు ఆర్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహం పక్కన సగం కాలిన ఫోన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా.. లేక ఇక్కడే హత్య చేసి మృతదేహన్ని తగుల బెట్టారా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
ఆధారాల కోసం క్లూస్ టీమ్ని రంగంలోకి దింపారు. చుట్టూ పక్కల ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఆధారాల కోసం ఆ ఏరి యాలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ సాధన రేష్మి పెరు మాళ్ ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >