Posted on 2025-10-30 13:25:57
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఇటీవలి వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం చిన్న బోనాల వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ...
“రైతు పంట తడిసి నష్టపోతున్నా, ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. వెంటనే నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం ప్రకటించి, పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలి.” శ్రీకాంత్ అన్నారు.
అలాగే ఆయన తీవ్రంగా విమర్శిస్తూ
“రైతుల కన్నీళ్లు తుడవడంలో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు కష్టాలపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఫొటోలు, ప్రకటనలతో కాకుండా రైతు పంటను కాపాడటమే నిజమైన పాలన.” అని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుంది. రైతు న్యాయం కోసం, పంట రక్షణ కోసం అవసరమైతే వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తాం. అని శ్రీకాంత్ తెలిపారు.
త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వాహనాలు హమాళీ గోనె సంచుల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు కంబోజు శ్రీధర్, నరసయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, దూడం సురేష్, కార్యదర్శి శివరాం వినయ్ దేవరాజు, ఇంజపురం మురళి, గాలి శ్రీనివాస్ వడ్నాల శేఖర్ బాబు రామారావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-05-27 16:58:02
Readmore >
ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:43:06
Readmore >
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-05-27 16:39:20
Readmore >
కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:35:33
Readmore >
వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
Posted On 2026-05-27 16:31:01
Readmore >