Posted on 2025-10-28 14:57:24
ఆ రెండు పార్టీలు తోడుదొంగలే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించడం తద్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో కలిసి మంగళవారం ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతం నుండి బీజేపీకి 25,000 ఓట్ల మెజారిటీ రావడం ప్రజల నమ్మకానికి నిదర్శనం అని అన్నారు. అదే విశ్వాసంతో ఈ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా ప్రజలు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని బ్రహ్మాండమైన మెజారిటీతో ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గడచిన 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం “ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్” పాలనగా మారిందని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇండ్లు, ఒక్కటీ అమలు కాలేదని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. హైదరాబాద్ నగరానికి కనీస మౌలిక వసతులకైనా నిధులు కేటాయించలేకపోవడం రేవంత్ రెడ్డి పాలన చేతకాని వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చిన్న వర్షానికే రోడ్లు మునిగిపోతున్నాయని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 2014–2023 మధ్య బీఆర్ఎస్ కుటుంబరాజకీయం, అవినీతి, భూస్కాంలతో ప్రజలను విసిగించిందని, ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లను ప్రజలు తిరస్కరించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రమే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగల పార్టీ అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్కు కేంద్ర నిధులు, పథకాల ద్వారా అనేక ప్రయోజనాలు అందాయని చెప్పారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడు కావాలని, అది తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తోనే సాధ్యమవుతుందన్నారు. ఆయన అనునిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు అని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >