Posted on 2024-01-06 08:35:11
డైలీ భారత్, హైదరాబాద్ :మల్లంపేట లోని నారాయణ మహిళా జూనియర్ కళా శాల తరుచూ వివాదాలకు కారణం అవుతోంది.
గతంలో కళాశాలలో చదు వుతున్న విద్యార్థులను మరోచోటికి పంపించడంతో తల్లి దండ్రులతో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హుటా హుటిన విద్యార్థు లను స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తర లించినట్లు సమాచారం. విద్యార్థుల అస్వస్థతకు కలుషిత ఆహారం, తాగు నీరు కలుషితం కావడమే కారణంగా తెలుస్తుంది.
కళాశాల వంటగదిని పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమా చారం. సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను యాజమాన్యం తరలిస్తు న్నట్లు తెలుస్తోంది.
1500 మంది విద్యార్థులు ఉన్న మల్లంపేట నారాయణ మహిళా జూనియర్ కళాశా లలో కలుషిత ఆహారం, తాగు నీటి సమస్య వల్ల 200 మందికి పైగా విద్యా ర్థులు అస్వస్థతకు గురికా వడంతో సంక్రాంతి సెలవులు పేరుతో గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులను ఇళ్లకు తరలించారు.
ఓ వైపు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నా సంక్రాంతి 10 రోజుల ముందే విద్యా ర్థులకు సెలవుల పేరుతో తరలిస్తుండడంతో తల్లి దండ్రులు ఆందోళన చెందు తున్నారు. కళాశాల ఏజీఎం ప్రసాద్ను వివరణ కోరగా వాతావరణ సమస్య వలన కొందరు విద్యార్థులు అస్వ స్థతకు గురైంది వాస్తవమే అన్నారు.
విద్యార్థులు ఆందోళన చెందకుండా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు సంక్రాంతి సెలవుల అనంతరం నిర్వహిస్తా మన్నారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >