| Daily భారత్
Logo




100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం

News

Posted on 2024-01-06 04:48:06

Share: Share


100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ లో కొత్త ప్రభు త్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్‌ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీ హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు.

ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవ డంతో.. కొత్తది నిర్మించా ల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

వీటిని రాజేంద్రనగర్ పరిధిలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సి టీల్లోని స్థలంలో నిర్మించ డానికి అనుమతి ఇచ్చింది.

హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం ప్రేమావతిపేట, బుద్వేలు గ్రామాల పరిధిలోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్, కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివ ర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని న్యాయ శాఖకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

హైకోర్టు నూతన భవన నిర్మాణ అవసరాల దృష్ట్యా ఆ భూమిలోని 100 ఎకరా లను కొత్త భవనానికి కేటా యించాలని నిర్ణయించి నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి.. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, న్యాయమూర్తులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నూతన భవన సముదాయం నిర్మాణ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. భవన నిర్మాణం ప్రతిపాదనలు, 100 ఎకరాలు అవసరం, వాటి కేటాయింపుల గురించి ఇరువురు చర్చించారు. దీనికి అనుగుణంగా భూకేటాయింపులపై సీఎం హామీ ఇచ్చారు

Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది

Posted On 2026-04-02 12:04:26

Readmore >
Image 1

రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ

Posted On 2026-04-02 11:35:51

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ

Posted On 2026-04-02 11:29:23

Readmore >
Image 1

నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ

Posted On 2026-04-02 07:41:02

Readmore >
Image 1

జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్

Posted On 2026-04-02 07:30:03

Readmore >
Image 1

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

Posted On 2026-04-02 06:54:11

Readmore >
Image 1

జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం

Posted On 2026-04-02 06:52:45

Readmore >
Image 1

గ్రామసభలను ప్రజలు వినియోగించుకోవాలి

Posted On 2026-04-02 05:45:28

Readmore >
Image 1

అక్రమ నిర్మాణము... నిలిపివేతకు కోర్టు స్టే ఆర్డర్

Posted On 2026-04-02 05:01:24

Readmore >
Image 1

సెస్ విలీనంపై నిరసనలకు కేటీఆర్ పిలుపు..

Posted On 2026-04-02 03:19:01

Readmore >