బీర్కూర్ మండలంలో విషాదం.. పిల్లల ముందే గర్భిణీ ఆత్మహత్య
గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీర్కూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై మహేందర్ వివరాల ప్రకారం.. వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన నాగరాణి(25)కి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆమెను రెండేళ్ల నుంచి అదనపు కట్నం కోసం భర్త సంతోష్ వేధిస్తున్నాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీనితో మనస్తాపానికి గురై నాలుగు నెలల గర్భిణీగా ఉన్న నాగరాణి పిల్లల ముందే ఉరేసుకుని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.