Posted on 2025-10-16 23:04:36
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట /నల్లబెల్లి క్రైమ్: పది వేల రూపాయల అప్పు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. కొండాపురం గ్రామానికి చెందిన మెరుగుత్తి రమేశ్, సురేశ్ అన్నదమ్ములు . కాగా నాలుగు నెలల కిందట తమ్ముడు సురేశ్ వద్ద అన్న రమేశ్ అవసర నిమిత్తంకి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తల్లి సమ్మక్కతో ఇంటి స్థల విషయంపై గొడవ పడుతుండగా అదే సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్ తన అన్నని డబ్బులు ఇవ్వాలంటూ రమేశ్తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగగా క్షణికావేశంలో సురేశ్ కత్తితో అన్న వీపు పై పొట్ట భాగంలో దాడి చేశాడు. పక్కనే ఉన్న వదిన స్వరూప ఆపడానికి ప్రయత్నించగా ఆమె ఛాతి పైనా దాడికి దిగాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందింది. రమేశ్ను మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం పై మృతురాలి కొడుకు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >