డైలీ భారత్ న్యూస్, నర్సంపేట:బిసిలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగంలో అమలు పరచాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షలు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ గురువారం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్య ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో బిసిలకు రిజర్వేషన్ లు పెంచాలని గత కొంత కాలంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ లు కల్పించాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకుండా 9వ షెడ్యూల్ లో చేర్చక పోవడంవల్ల బిసి లకు రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి రాంచేందర్, షేక్ జావీద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
News
తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన 42 శాతం బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్ లో చేర్చాలి