| Daily భారత్
Logo




ప్రభుత్వ హాస్పిటల్ లోనే డెలివరీ కావాలి : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

News

Posted on 2025-10-16 19:28:53

Share: Share


ప్రభుత్వ హాస్పిటల్ లోనే డెలివరీ కావాలి : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

వైద్య అధికారుల  పని తీరు మెరుగు పడాలి

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందాలి

డైలీ భారత్, జనగాం: ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని దాన్ని కాపాడుకునే విధంగా వైద్య అధికారులు సేవాలాందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు

వైద్య సేవలకు సంబందించిన వివిధ అంశాల మీద  పీహెచ్ సి ల వారీగా...జిల్లా వైద్య అధికారి, అన్ని పీహెచ్ సి ల మెడికల్ అధికారులు, సూపరవైజర్ లతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్షించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... 

ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని....దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవల విషయం లో మెడికల్ అధికారులు బాధ్యత యుతం గా పని చేయాలన్నారు

కార్పొరేట్ ఆసుపత్రి లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి లలో  అత్యాధునిక వైద్య పరికరాలు, యంత్రాలు ఉన్నాయన్నారు 

అందుకు తగ్గట్టు గా డాక్టర్ లు తమ విధులను నిర్వర్తించాలన్నారు 

ప్రసవాలు  కేవలం ప్రభుత్వ ఆసుపత్రి లోనే జరగాలని..

క్లస్టర్ లెవల్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పురోగతి సాధించాలన్నారు

మాతృ ఆరోగ్యం & పోషణ కార్యక్రమం (MHN), క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు & స్ట్రోక్ నివారణ & నియంత్రణ జాతీయ కార్యక్రమం (NPCDCS), బాల ఆరోగ్యం మరియు టీకా కార్యక్రమం, జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NTEP), వెక్టార్ బోర్న్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NVBDCP), సీజనల్ వ్యాధులు తదితర కార్యక్రమాల పురోగతి ని కలెక్టర్  ప్రతీ పీహెచ్ సి  మెడికల్ అధికారి ని అడిగి తెలుసుకున్నారు 

ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణను మరింత బలపరచాలని, నివేదికల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచాలని, అన్ని ఆరోగ్య సూచికలను సమయానికి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంపుపై దృష్టి సారించాలని, ప్రసవాలు జరపని వైద్యాధికారులపై శూన్య సహనం (Zero Tolerance) విధించాలని, అలాగే తీవ్ర, మధ్యస్థ పోషకాహార లోపం (SAM/MAM) ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.

తక్కువ పనితీరు కనబరిచిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.

జిల్లా లో వైరల్, డెంగ్యూ  జ్వరాలు ప్రబల కాకుండా  తగు చర్యలు తీసుకోవాలని... ఫీవర్ సర్వే ను నవంబర్ 15 వరకు కొనసాగించాలన్నారు

జిల్లా లోని ప్రభుత్వ రీసెడెన్షియల్ విద్య సంస్థ లలో చదువుతున్న ప్రతీ విద్యార్థి కి  ఇచ్చిన హెల్త్ కార్డు లో ఉన్న పరీక్ష లను నెలరోజులో పూర్తి చేయాలన్నారు

పేద కుటుంబాలకు  చెందిన విద్యార్థుల చదువు తో పాటు వారి ఆరోగ్యన్ని  కూడా కాపాడలిసిన అవసరం మెడికల్ అధికారుల మీద ఉందని గమనించాలన్నారు

ఈ సమావేశానికి డా. కె. మల్లిఖార్జున రావు, జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి,  ప్రోగ్రాం అధికారులు, PHC & RBSK వైద్యాధికారులు, రిపోర్టింగ్ సూపర్వైజర్లు,  ఇతర జిల్లా ఆరోగ్య సిబ్బంది హాజరయ్యారు.

Image 1

అరుదైన వ్యాధి బాధితురాలు సాత్వికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

Posted On 2026-05-08 11:47:46

Readmore >
Image 1

ప్రేమించిన పాపానికి నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

Posted On 2026-05-08 11:30:03

Readmore >
Image 1

ప్రపంచాన్ని కలవరపెడుతున్న హంటా వైరస్..

Posted On 2026-05-08 10:58:29

Readmore >
Image 1

12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు

Posted On 2026-05-08 08:07:43

Readmore >
Image 1

శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్

Posted On 2026-05-07 22:23:39

Readmore >
Image 1

పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-05-07 22:08:07

Readmore >
Image 1

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

Posted On 2026-05-07 20:29:13

Readmore >
Image 1

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

Posted On 2026-05-07 20:07:14

Readmore >
Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

Posted On 2026-05-07 19:59:26

Readmore >
Image 1

"ఒత్తిడిని జయించేద్దామా" (మీ కోసమే మేమున్నాం..)

Posted On 2026-05-07 19:55:06

Readmore >