| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ ఏర్పాటుకి సంబంధించిన సమావేశం

ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ ఏర్పాటుకి సంబంధించిన సమావేశం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ కార్యవర్గం గురువారం సమావేశమైంది. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవం ఈ నెల 29న  ఏర్పాటు చేయ్యాలని కార్యవర్గం నిర్ణయించింద ఇందూర్ యువత వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి, సాయిబాబు, ప్రధాన కార్యదర్శి బాలకిషన్లు మాట్లాడుతూ   ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి  మరియు యువతలోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

తమ సంస్థ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సేవా సంస్థ గా అందరి ఆదరాభిమానాలు సంపాదించుకుందని అన్నారు 

మరిన్ని సేవా కార్యక్రమాలతో తమ సంస్థ  నిరంతరం సమాజం కోసం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఈ.సి మెంబెర్స్ యం.వి సుజాత రెడ్డి, చందా జగన్ మోహన్, ప్రశాంత్ , నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous మునిపల్లి గ్రామ అభివృద్ధికి 2 కోట్ల 29 లక్షల నిధులు మంజూరు
Next ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమాలను తప్పనిసరిగా పాటించాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
ADVERTISEMENT