| Daily భారత్
Logo




ప్రధానమంత్రి పర్యటన రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

News

Posted on 2025-10-14 21:14:36

Share: Share


ప్రధానమంత్రి పర్యటన రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

డైలీ భారత్, కర్నూల్:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లపై కర్నూల్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన మన రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ సభలో వేలాదిమంది ప్రజలు పాల్గొనబోతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రవాణా, పార్కింగ్, నీరు, వైద్య సదుపాయాలు, భద్రత, వేదిక ఏర్పాట్లు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభ విజయవంతం కావడం మన అందరి బాధ్యత. ఏ ఒక్క విభాగం నిర్లక్ష్యం వహించకూడదు. ప్రతి శాఖ అధికారులూ, నాయకులూ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి. రోడ్లు, ట్రాఫిక్ మార్గాలు, వసతి, భద్రతా ఏర్పాట్లు సవ్యంగా ఉండేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రజలు సౌకర్యంగా సభ ప్రాంగణానికి చేరుకుని, తిరిగి సురక్షితంగా వెళ్లేలా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. కూటమి పక్షాలన్నీ ఒకే దిశగా ఆలోచించి, సమన్వయ భావంతో పని చేయాలని ఆయన సూచించారు. మనందరం ఒక జట్టుగా కృషి చేస్తేనే సభ చారిత్రాత్మకంగా నిలుస్తుంది. ప్రధాని పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని అవకాశాలను తెస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధను, సమయాన్ని, కృషిని ఈ సభ విజయవంతానికి అంకితం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

సమావేశంలో సభ ప్రాంగణం, వేదిక డిజైన్, ప్రజల రాకపోకల మార్గాలు, పార్కింగ్ జోన్లు, భద్రతా బందోబస్తు తదితర అంశాలపై సమీక్ష జరిగింది. అధికారులు తగిన సూచనలు అందించి, అవసరమైన మార్పులు, మెరుగుదలలపై చర్చించారు. ఈ సభలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తన వంతు పాత్ర పోషిస్తే, కర్నూలు సభను దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబెట్టగలమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >