Posted on 2025-10-13 20:09:31
డైలీ భారత్, నిజామాబాద్:మగవారిని ఆకర్షించేలా తమ అందాలను చూపిస్తూ వారిని వల్లో వేసుకోవడానికి ప్రేరేపిస్తూ న్యూసెన్సు క్రియేట్ చేసిన ఆరుగురు మహిళకు జైలు శిక్ష ఖరారైందని నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ లో వివరాలు వెల్లడించారు. ఈనెల 11 న రాత్రి 8 గంటలకు నగరంలోని బస్టాండు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కామారెడ్డి, భైంసా ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలు మగవారిని ఆకర్షించేందుకు తమ అవయవాలను చూపిస్తూ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్సు క్రియేట్ చేస్తుండటంతో వారి పై 68 సిటీ పోలీస్ యాక్టు సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి వివరించారు.
సోమవారం ఆరుగురు మహిళలను స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచారు. నిందితుల్లో ఒకరికి ఒకరోజు, మిగతా ఐదుగురు నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడమైందని ఎస్హెచ్ఓ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వీరిని జైలుకు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే వారి పై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని రఘుపతి హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >