మాలలకు 15% నుంచి 18% వరకు రిజర్వేషన్ వచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తాం
రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తనకు మంత్రి పదవి పై ఆశ లేదని ఐక్యత కోసంమాల జాతి ఐక్యత కోసం మాలలు పోరాడుతున్న రిజర్వేషన్లఅధిష్టానం కోసం ఉద్యమం కొనసాగించడమే తన ముఖ్య ద్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అదేవిధంగా మాలలకు 15 శాతం నుండి 18% వరకు రిజర్వేషన్ కేటాయించే విధంగా రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి దృష్టికి తీసుకువెళ్లి మాలలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మనమందరము ఒక తాటిపై నిలబడి మన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి స్టేజి నుంచి వెళ్లిపోవడం జరిగిందనడం తప్పుగా ప్రచారం చేస్తున్నారని అక్కడి నుండి వెళ్లలేదని సమాధానం ఇచ్చారు. నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కీర్తిశేషులు జి వెంకటస్వామి (కాక) 96వ జయంతి వేడుకలు మాలల ఐక్య సదస్సు లో ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ తన తండ్రి జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు తనకు మంత్రి పదవిపై ఆశ లేదని ఒకరోజు మంత్రి పదవి చేసిన మాలల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ మాలల ఐక్యతను చూస్తే సంతోషంగా సంతోషంగా ఉందన్నారు పెట్టింది పేరు క్రమశిక్షణకు పెట్టింది పేరు అని అన్నారు. కుల మతాలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. రోస్టర్ విధానం వల్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో పని చేసే మన మాలలు కావాలని కొందరు ఉన్నత వర్గాల ఉద్యోగులు వారిని తొలగించడం బదిలీలు చేయడం ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారని ఈ వివక్షకు గురికాకుండా పనిచేద్దామని మాల జాతిని కించపరిచే విధంగా కొందరు కుట్రలు పన్నుతున్నారని కుట్రలను కుట్రలను తిప్పికొట్టే సమయం మాలల ఐక్యతతోనే సాధ్యమని అన్నారు. మాలల వర్గీకరణ కోసం నిరంతరంగా పోరాడుతూనే వస్తున్నామని ఇందుకు అన్ని కుల సంఘాలు సహకరించి బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. తాను ఐపీఎస్ గా పోలీసు పూర్తిచేసిన సమయంలో ఎంతో ఆప్యాయతగా తన విధులకు ఆటంకం కలిగించకుండా పనిచేశారని గుర్తు చేశారు. కానీ రాజకీయాల్లో కుల వివక్ష కొనసాగుతుందని దీనిపై పోరాడాలని ఇందుకు మన ఐక్యత మన కార్యచరణ కోసం పోరాడి కొనసాగించాలని అన్నారు. కాకా వెంకటస్వామి కులం మతం అనే వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేవారని వారి అడుగుజాడలో నడుస్తున్న ఆయన తనయుడు వివేక్ వెంకటస్వామి ఆశయ సాధనలో మనమందరం ముందుకు వెళ్దామని ఆయన అన్నారు. అనంతరం ఇటీవల గ్రూప్ వన్, గ్రూప్ 2లో విజయం సాధించిన అభ్యర్థులను సత్కరించారు. క