Posted on 2025-10-10 18:03:39
జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు వినతి పత్రం అందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యమంత్రికి అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికై నిధులు వెచ్చించాలని వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలో పేద విద్యార్థుల చదువు కోసం ఇంటిగ్రేటెడ్ స్కూలు త్వరగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో కి తీసుకురా వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులు మంజూరు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. అలాగే నగర శివారులోని నాగారం లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను అదేవిధంగా చంద్రశేఖర్ కాలనీ సమీపంలో ఉన్న అభయహస్తం కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వస్తువులతో కూడిన పరికరాలు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని డిపార్ట్మెంట్ లకు సంబంధించిన వైద్యులు జిల్లా ఆస్పత్రి లో ఉండే విధంగా తక్షణమే వైద్యులను నియమించాలని ఆయన కోరారు. అలాగే నిజామాబాద్ బస్టాండ్ ను ఆధునికరించేందుకు ప్రత్యేక నిధులు వెచ్చించి అందరికీ అన్ని వసతులతో కూడిన విధంగా ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో సీఎంకు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విన్నవించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >