Posted on 2025-10-08 18:04:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం లో పరామర్శించారు. గత నెల 29 న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి బుధవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేకుల పల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి, అమ్మ లక్ష్మీ నర్సమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ అనంతరెడ్డి,మాజీ సర్పంచ్ పద్మ రెడ్డి,బీజేపీ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వరి,బీజేపీ నాయకులు,బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >