| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని  బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి  నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం లో పరామర్శించారు. గత నెల 29 న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న  బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి  బుధవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించారు.  ప్రగాఢ సానుభూతి  తెలిపారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేకుల పల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి, అమ్మ లక్ష్మీ నర్సమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ అనంతరెడ్డి,మాజీ సర్పంచ్ పద్మ రెడ్డి,బీజేపీ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వరి,బీజేపీ నాయకులు,బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.


Previous బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
Next స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి : రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
ADVERTISEMENT