Posted on 2025-10-05 17:30:01
పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
డైలీ భారత్, పాల్వంచ: శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాత పాల్వంచ గడియ కట్టలో మైసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఆదివారం పాత పాల్వంచలోని వీధులలో అమ్మవారిని ఊరేగించారు.ఆలయ పూజారి పురాణం పవన్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా నిమర్జనానికి భద్రాచలం తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు అభినందనీయులు-కొత్వాల
పాత పాల్వంచ గడియ కట్టలోని మైసమ్మ తల్లి ప్రాంగణంలో శ్రీదేవి శరన్నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారని దీనికి కమిటీ సభ్యులు అభినందనీయులని కొత్వాల అన్నారు.ఈ సందర్భంగా కొత్వాల వారిని శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు మసనం శరత్, వంగా రమేష్,కోసూరి కిరణ్ కుమార్,రౌతు మల్లేష్, కరుకుల సతీష్,మణికంఠ,పాశం నాసరయ్య ,ముత్యాల కోటేశ్వరరావు,లక్ష్మణ్,బర్ల అన్వేష్, లింగయ్య,శంకర్ రెడ్డి,సాగర్ తదితరులు పాల్గొన్నారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >