Posted on 2025-10-05 12:59:18
ఇరువురికి గాయాలు ఆసుపత్రికి తరలించిన పోలీసులు
డైలీ భారత్, నిజామాబాద్:జిల్లాకేంద్రంలో సమీప బంధువులైన ఇద్దరు యువకుల మధ్య మద్యం తాగిన అనంతరం మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు పాల్పడగా ఓ యువకుడికి కత్తిపోట్లు కాగా మరో యువకుడు గాయపడ్డాడు. నిజామాబాద్ రూరల్ ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరం లోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆకాశ్, మాణిక్ అనే ఇద్దరు యువ కులు కలిసి శనివారం రాత్రి ఓ చోట మద్యం సేవించారు. అనంతరం వీరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘర్ష ణలో ఆకాశ్ కు స్వల్పగాయాలయ్యాయి. ఇంటికి తిరిగి వచ్చిన ఆకాశ్ ముఖంపై గాయాలు చూసి అతడి తమ్ముడు, కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ప్రశ్నించి, వారందరూ కలిసి దాడి చేసిన మాణిక్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీశారు. ఆగ్రహంతో మళ్లీ ఇంట్లోంచి కత్తి తెచ్చి ఆకాశ్ తలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆకాశ్ తలపై గాయమైంది. దీంతో అక్కడే ఉన్న ఆకాశ్ తమ్ముడు అరుణ్ కూడా మాణిక్ పై దాడి చేశాడు. దీంతో మాణిక్ కు సైతం గాయమైంది. ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరుపక్షాల వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >