డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన వదులుతున్నారు. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా దిగువకు 1,09,790 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కాలువ ద్వారా 4000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, మిషన్ భగీరథ ద్వారా 231 వదులుతుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతుంది.
News
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు