| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజావాణి కార్యక్రమం రద్దు : జిల్లా కలెక్టర్ ఎం. హరిత

ప్రజావాణి కార్యక్రమం రద్దు : జిల్లా కలెక్టర్ ఎం. హరిత

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో  ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. హరిత ఒక ప్రకటనలో తెలిపారు. 

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 

ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని  కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని  వెల్లడించారు.

Previous ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్
Next ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం... అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
ADVERTISEMENT