Posted on 2025-10-04 21:42:30
నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
కామారెడ్డి సబ్ డివిజన్ ఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విజయదశమి రోజు అర్ధరాత్రి కలకలం రేపిన దాడుల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనకు కారకులైన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు ‘100’కు కాల్ వచ్చిందని, వెంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ రెండు గ్రూప్లు కొట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా గాజుముక్కతో దాడి జరిగినట్లు తేలిందన్నారు. అలాగే కేతన్, ప్రఫుల్ అనే ఇద్దరు యువకులపై సిద్దార్థ్ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేశాడన్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయని, సిద్దార్థ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >