Posted on 2025-10-04 17:34:46
హైదరాబాద్ నుండి సెలవులకు సొంతుళ్ళ కు వచ్చిన ప్రయాణికులకు తిరిగి వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సులు కరువు..
రాజధాని, సూపర్ లగ్జరీ సర్వీసులు తప్ప హైదరాబాదుకు ఎక్స్ప్రెస్ బస్సులు కేటాయించని అధికారులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణలోని అతిపెద్ద పండగలైనా బతుకమ్మ, దసరా పండుగలకు వృత్తి, వ్యాపార పరంగా జిల్లా వాసులు హైదరాబాద్లో స్థిరపడినవారు పండగ ముగియడంతో తిరిగి శనివారం వెళ్లేందుకు శనివారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ కు జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుండి కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లేందుకు చేరుకున్నారు. అయితే ఆర్టీసీ నిజామాబాద్ అధికారులు మాత్రం ప్రయాణికుల కోసం సరిపోయాన్ని సర్వీసులు వేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ప్రయాణికుల నుండి వెలువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉదయం నుండి రాజధాని, సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసులు మాత్రమే నడిపిస్తున్నారే తప్ప సామాన్య మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఎక్స్ప్రెస్ బస్సులు ఉదయం నుండి ఒంటిగంట వరకు ఒకటి కూడా కేటాయించకపోవడంతో ఆర్టీసీ అధికారుల పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు సమస్య వెల్లడించిన ఎక్స్ప్రెస్ కేటాయించడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >