Posted on 2025-10-01 18:17:00
• ఇంట్లో పని చేసే పనిమనిషి దొంగతనానికి పాల్పడింది.
• మొత్తం 55 లక్షల విలువైన సొత్తు రికవరీ.
• 53 లక్షల విలువైన 43.6 తులాల బంగారము, రూ.1.75 లక్షల నగదు సీజ్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు.
వివరాలు వెల్లడించిన నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణం కృష్ణానగర్ కాలనీలో 80 సంవత్సరాల ఒక వృద్ధురాలు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సూర్యాపేట పట్టణ పోలీసులు, CCS పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ గారు వెల్లడించారు. కేసును ఛాలెంజింగ్ తీసుకుని కేసులో ఉన్న ఆదారాలతో సూర్యాపేట పట్టణ మరియు CCS పోలీసులు ఒక్కరోజులోనే కేసు ఛేదించారు. బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు దొంగతనం నమోదు చేసి త్వరితగతిన దర్యాప్తు చేశారు.
నిందితుల వివరాలు :
1) కరీమా బేగం వయసు 45 సంవత్సరాలు, నాయకెన్ గూడెం గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, ప్రస్తుతం కృష్ణా నగర్ కాలనీ, సూర్యాపేట పట్టణం.
స్వాధీనం వివరాలు :
1. 40 తులాల బంగారు బిస్కెట్లు.
2. 3.6 తులాల చంద్రహరం (కూసుమంచి SBI Bank లో ఉన్నది)
3. రూ.1.75 లక్షల నగదు. (మొత్తం విలువ 55 లక్షలు )
కృష్ణానగర్ కాలనీలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నది, ఈమె కుమారులు ముగ్గురు హైద్రాబాద్ లో ఉంటారు, ఈ వృద్ధురాలికి సేవలు చేయడం కోసం వృద్ధురాలు కుమారులు పనిమనిషిని ఏర్పాటు చేశారు. నమ్మకంగా పనిచేస్తూ వృద్ధురాలి వద్ద తాళం చేతులు గమనించి ఆమె ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు బిస్కెట్లు (4 బిస్కెట్లు), మూడున్నర తులాల బంగారు చంద్రహారం, నగదును అపహరించింది. వృద్ధురాలి కుమారులు ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు తేదీ 29/9/2025 రోజున ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు పై దొంగతనం కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది, దర్యాప్తులో భాగంగా వృద్ధురాలి ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న పనిమనిషి కరీమా బేగం, వయసు 45 సంవత్సరాలు, నాయకెన్ గూడెం గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, ప్రస్తుతం కృష్ణా నగర్ కాలనీ, సూర్యాపేట పట్టణం మహిళలను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నది. ఆమె వద్ద నుండి 40 తులాల బరువు గల నాలుగు బంగారు బిస్కెట్లు 1.75 లక్షల రూపాయల నగదును, మూడున్నర తులాల ఛంద్రహరం తాడు (బ్యాంక్ లో ఉన్నది) సీజ్ చేసి ఈరోజు కోర్టుకు హాజరు పరచడం జరుగుతుంది. బంగారం విలువ 53 లక్షలు నగదు కలుపుకొని మొత్తం 55 లక్షల సొత్తును సూర్యాపేట పట్టణ పోలీసులు రికవరీ చేశారు. నిందితురాలు కోర్టుకు రిమాండ్ నిమిత్తం హాజరు పరచడం జరుగుతుంది. ఎస్పి గారి వెంట సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, SI లు శివతేజ, సురేష్, సిబ్బంది ఉన్నారు.
ఈ కేసులో బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, CCS ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై శివతేజ, ఎస్ఐ సురేష్, సూర్యాపేట పట్టణ పోలీసు సిబ్బందిని, సిసిఎస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి రివార్డ్స్ అందించడం జరిగింది.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >