Posted on 2025-09-19 22:38:06
భావితరాలకు కాలుష్యరైత వాతావరణాన్ని ఇవ్వాలి
మొక్కలే మానవాళికి జీవనాధారం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతూ మరియు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయుడు ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ పర్యావరణపరిరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భావితరాలకు22 ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటుతూ,వాటిని సంరక్షిస్తూ యువతలో పర్యావరణంపై చైతన్యం కలిగించేందుకు పుట్టినరోజు, పెళ్లిరోజు ఏదైనా శుభకార్యమైన పచ్చని మొక్కను బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా నాటాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు క్రీడాకారులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒక చెట్టు నాటితే అది మనకు పది తరాలకు జీవనాధారం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >