Posted on 2025-09-18 18:30:38
సీపీలు మారిన రూరల్ పోలీస్ స్టేషన్ గతి మారని స్థితి..
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన రూరల్ నూతన పోలీస్ స్టేషన్ భవనం
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ లో గల ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూల్చివేసి అదే స్థలంలో నిజామాబాద్ నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. దీంతో కంటేశ్వర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అద్దె భవనంలోకి రూరల్ పోలీస్ స్టేషన్ విధులు కొనసాగుతున్నాయి. దాదాపు 6 నుండి 8 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని అరకొక మరమ్మత్తులు జరగక ప్రారంభోత్సవానికి నోచుకోక అసాంఘిక కార్యకలాపాలకు జల్సాలకు అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు మద్యం బాబులకు ఈ నూతన పోలీస్ స్టేషన్ భవనం అడ్డాగా మారిందని దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రశేఖర్ కాలనీలో గల రూరల్ పోలీస్ స్టేషన్ భవనానికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి పోలీస్ స్టేషన్ ప్రారంభించవలసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు.
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >