Posted on 2023-12-29 11:25:36
డైలీ భారత్, కరీంనగర్: అమ్మమ్మ ఊరి నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు ఎక్కిన బాలిక కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ వద్ద బుధవారం అదృశ్యం కాగా శుక్రవారం సికింద్రాబాద్ లో ఉదయం ప్రత్యక్ష మయింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కనుకుంట్ల నర్సింహంకు కనుకుంట్ల వశిస్ట క్రిష్ణ (13) అనే కుమార్తె ఉంది.పాఠశాలలకు రెండు రోజులు క్రిస్మస్ సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్ళింది.
సెలవులు పూర్తవ్వడంతో బుధవారం ఉదయం వశిస్ట తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించి కరీంనగర్ కు పంపాడు. తాతయ్య అమ్మాయి తండ్రికి బస్సు నెంబర్ మెసేజ్ చేశాడు.
కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా స్టేజి దగ్గర తండ్రి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే బస్సు వచ్చింది కానీ అమ్మాయి బస్సులో నుంచి రాలేదు. కండక్టర్ను అడగగా అమ్మయి బైపాస్ లోనే దిగింది అని చెప్పాడు.
వెంటనే నర్సింహం బండి పై బైపాస్ దగ్గర వెళ్లి చూడగాఅమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలిస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అమ్మాయి కోసం పోలీసులు అయిదు బృందాలుగా ఏర్పడి గాలించగా శుక్రవారం సికింద్రాబాద్ లో ప్రత్యక్షం అయింది.
అయోమయంలో ఒక చోట దిగవలసింది మరోచోట దిగడం ఫ్రీ బస్ ప్రయాణం కావడంతో తోచిన వైపు బస్ ఎక్కి ప్రయాణం చేసి ఉండవచ్చాని తెలిస్తోంది. సరదాగా ప్రయాణం చేసిందా?మరేమైన కారణాలు ఉన్నాయా?అన్నది తెలవలసి ఉంది
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >