Posted on 2025-09-17 18:13:41
దాస్ నగర్ మాక్లూర్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దాస్ నగర్ మాక్లూర్ రోడ్డుపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపు తప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దాస్ నగర్ మాక్లూర్ రోడ్డులో దుర్గానగర్ తండా సమీపంలో బుధవారం ఈఘటన చోటు చోసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటూ (30) తన భార్య పూజ (25), తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్పై నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. బైక్ చింటూ నడుతున్నాడు. మార్గ మధ్యలో మాక్లూర్ - దాస్ నగర్ రోడ్డులో బైక్ అదుపు తప్పి కింద పడటంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. చింటూ, పూజలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూజ కూడా మృతి చెందింది. ప్రస్తుతం చింటూ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >