Posted on 2025-09-17 18:13:41
దాస్ నగర్ మాక్లూర్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దాస్ నగర్ మాక్లూర్ రోడ్డుపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపు తప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దాస్ నగర్ మాక్లూర్ రోడ్డులో దుర్గానగర్ తండా సమీపంలో బుధవారం ఈఘటన చోటు చోసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటూ (30) తన భార్య పూజ (25), తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్పై నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. బైక్ చింటూ నడుతున్నాడు. మార్గ మధ్యలో మాక్లూర్ - దాస్ నగర్ రోడ్డులో బైక్ అదుపు తప్పి కింద పడటంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. చింటూ, పూజలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూజ కూడా మృతి చెందింది. ప్రస్తుతం చింటూ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >