| Daily భారత్
Logo




కర్ణాటకలోని శృంగేరి సన్నిధానంలో వారాహి మాత పంచలోహ విగ్రహ పూజలో పాల్గొన్న మంచాల శంకరయ్య ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్

News

Posted on 2025-09-14 19:03:49

Share: Share


కర్ణాటకలోని శృంగేరి సన్నిధానంలో వారాహి మాత పంచలోహ విగ్రహ పూజలో పాల్గొన్న మంచాల శంకరయ్య ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్స్‌లో నిర్మాణం జరుగుతున్న శ్రీ వారాహి మాత దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయంలో ప్రతిష్టించబోయే పంచలోహ విగ్రహంకు కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పూజా మహోత్సవం జగద్గురు శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి దివ్య సన్నిధానంలో, అలాగే జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో పవిత్రంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పాల్గొని దైవ కృపను పొందారు. ఆలయ నిర్మాణం సమయానికి పూర్తి అవ్వాలని, ఈ క్షేత్రం భక్తుల ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువుగా నిలవాలని స్వాములు ఆశీర్వదించారు. నిజామాబాద్ నేలపై ఆవిష్కృతమవుతున్న ఈ వారాహి మాత ఆలయం, భవిష్యత్తులో భక్తులకు దివ్య దర్శన క్షేత్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ పూజా మహోత్సవంలో మంచాల జ్ఞానేందర్ గుప్త తో పాటు మరుమాముల వెంకట రమణ శర్మ, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, పురాణం మహేశ్వర శర్మ, వేగేటి పశుపతినాథ శర్మ, తుంద్ల కమలాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >