| Daily భారత్
Logo




కర్ణాటకలోని శృంగేరి సన్నిధానంలో వారాహి మాత పంచలోహ విగ్రహ పూజలో పాల్గొన్న మంచాల శంకరయ్య ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్

News

Posted on 2025-09-14 15:33:49

Share: Share


కర్ణాటకలోని శృంగేరి సన్నిధానంలో వారాహి మాత పంచలోహ విగ్రహ పూజలో పాల్గొన్న మంచాల శంకరయ్య ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్స్‌లో నిర్మాణం జరుగుతున్న శ్రీ వారాహి మాత దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయంలో ప్రతిష్టించబోయే పంచలోహ విగ్రహంకు కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పూజా మహోత్సవం జగద్గురు శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి దివ్య సన్నిధానంలో, అలాగే జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో పవిత్రంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పాల్గొని దైవ కృపను పొందారు. ఆలయ నిర్మాణం సమయానికి పూర్తి అవ్వాలని, ఈ క్షేత్రం భక్తుల ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువుగా నిలవాలని స్వాములు ఆశీర్వదించారు. నిజామాబాద్ నేలపై ఆవిష్కృతమవుతున్న ఈ వారాహి మాత ఆలయం, భవిష్యత్తులో భక్తులకు దివ్య దర్శన క్షేత్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ పూజా మహోత్సవంలో మంచాల జ్ఞానేందర్ గుప్త తో పాటు మరుమాముల వెంకట రమణ శర్మ, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, పురాణం మహేశ్వర శర్మ, వేగేటి పశుపతినాథ శర్మ, తుంద్ల కమలాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >