Posted on 2025-09-14 17:50:13
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లో రోడ్డుపై చెత్త వేయడం సర్వసాధార ణమే కదా! అని తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై అలా చేస్తే జరిమానాతో సరిపోదు, ఏకంగా 8 రోజుల పాటు.. జైలు శిక్ష అనుభవించవలసిందే నగరంలో రోడ్లపై చెత్త వేసే వారిపై హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు.
ఈ నిర్లక్ష్యం కేవలం అపరిశుభ్రతకే కాకుండా, కొన్నిచోట్ల సామాజిక ఉద్రిక్తతలకు కూడా దారితీస్తుండటంతో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నగరవాసులు రోడ్ల పక్కన పడేస్తున్న చెత్త, ముఖ్యంగా మాంసాహార వ్యర్థాలను వీధికుక్కలు, పిల్లులు వంటి జంతువులు లాక్కెళ్లి సమీపంలోని దేవాలయా లు, మసీదులు, చర్చిలు, ఇళ్ల ముందు పడేస్తున్నాయి.
ఈ కారణంగా సున్నితమైన ప్రాంతాల్లో వివాదాలు తలెత్తి, స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో, ఈ సమ స్యకు మూలకారణమైన రోడ్లపై చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవా లని పోలీసులు నిర్ణయించారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >