Posted on 2025-09-14 17:33:10
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కు అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాదం చేసిన సాహిత్య పుస్తకాన్ని ఆదివారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అస్సామీలో అనురాధ శర్మ పూజారి రాసిన 400 పేజీల పుస్తకాన్ని తెలుగు సాహిత్య అకాడమీ, బాల సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అనువాదకులు సిరిసిల్లకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ అనువదించారు. భారతీయ భాషల ఇంద్రధనస్సులో పుస్తక ఆవిష్కరణ జరిగింది.సిరిసిల్లకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాద పుస్తకం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు రచయితల సంఘాలు సాహితీ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >