Posted on 2025-09-14 10:16:05
డైలీ భారత్, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల చిన్న కుమారుడిని ఓ తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ నూరినగర్కు చెందిన మహ్మద్ అక్బర్ (35), ఆయన భార్య సనాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు అనాస్ (3) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ నేపథ్యంలో తన కుమారుడిని హత్య చేయాలని అక్బర్ ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి, భార్య విధులకు వెళ్లిన సమయంలో, దిండుతో చిన్నారిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి, మూసీ నదిలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని మొదటిగా ఎవరికీ అనుమానం రాకుండా నటించాడు. తరువాత, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, తండ్రిని గమనించిన పోలీసులు, అతడిపై అనుమానంతో గట్టిగా ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చివరకు తానే కుమారుడిని హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ అక్బర్ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహం కోసం రక్షణ బలగాలు మూసీలో గాలింపు చర్యలు చేపట్టాయి
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >