Posted on 2025-09-13 21:47:07
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఒక్క 1104 యూనియన్ ఎన్పీడీసీఎల్ డిస్కౌంట్ సర్వసభ్య సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాయిబాబు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిస్కౌంట్ నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తూ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం దిశగా తమ యూనియన్ ముందుకు వెళుతుందని అన్నారు. యూనియన్ లో ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఆయా జిల్లాలకు సంబంధించిన యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకు సంప్రదించాలని వాటి ద్వారా తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా డిస్కం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్న అధ్యక్షుడిగా రఘునందన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణారావు లతోపాటు ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >