| Daily భారత్
Logo




అన్ని దానాల్లో కన్నా అవయవ దానం మిన్న

News

Posted on 2025-09-13 20:07:46

Share: Share


అన్ని దానాల్లో కన్నా అవయవ దానం మిన్న

అవయవాలు దానం చేసిన రాజేష్ కుటుంబాన్ని అభినందించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సృష్టిలో అన్ని దానాల్లో కంటే అవయవ దానాలు చేయడం ఎంతో మిన్న అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన  బుర్ర రాజేష్ గౌడ్ మరణించిన అనంతరం అవయవాలు మరొకరికి దానం చేసినందుకు వారి కుటుంబాన్ని అభినందించారు. ముందుగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి   రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత  అవయవాలు దానం చేయడానికి వారి కుటుంబం ముందుకు రావడం ఎంతో  కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రాజేష్ భార్య, తల్లిదండ్రులు మరియొక ప్రాణాలను కాపాడాలని అవయవాలు దానం చేయడానికి అంగీకరించినందుకు  అభినందనీయమని అన్నారు. శనివారం రోజు బుర్ర రాజేష్ గౌడ్  కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంస్కరణ సభలో మాట్లాడుతూ  ఈ రోజుల్లో  చాలామంది  బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోతున్నారని, వారి కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేయడానికి అంగీకరిస్తే, అతని వల్ల మరొక ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారని అన్నారు.కండ్లు, కాలేయం, కిడ్నీలు,గుండె వంటి అవయవాలను దానం చేసి ఇతరులను కాపాడమే అన్నారు. ఎన్నో సంస్థలు అవయవ దానాలపై  అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాసు బాబు, ధర్మ గౌడ్, శ్యామ్ సన్, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.


Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >