Posted on 2025-09-13 20:06:35
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మోపాల్ మండల మోటటి రెడ్డి సంఘ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మోపాల్ మండల మోటాటి రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే కు వివరించడంతో ఎమ్మెల్యే భూపతిరెడ్డి సానుకూలంగా స్పందించి, అన్ని విధాల అండగా ఉంటాను హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల మొటాటిరెడ్డి సంఘం అధ్యక్షులు గుడి ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి, కోశాధికారి రవీందర్ రెడ్డి, సంఘ సభ్యులు ఉన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >