Posted on 2025-09-13 17:26:57
అభిమానులతో సెల్ఫీ దిగిన నటి
నగరంలో గోయాజ్ సిల్వర్, జువెలరీ షోరూమ్ ప్రారంభించిన నటి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లోని గోయజ్ సిల్వర్ జువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఐశ్వర్య రాజేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన సినిమా పాటకు స్టెప్పు లేసి అందరి మనసును దోచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ షో రూమ్ గోయాజ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ ముంబై ఇలాంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ నిజామాబాద్ నగరం కూడా అన్ని రంగాల్లో రాణిస్తుందని ఆమె అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న జ్యువెలరీ ఆభరణాల దుకాణాలు నిజామాబాద్ లో ఉండడం విశేషమని ఆమె అన్నారు. దేశంలో ఉన్న ప్రధాన నగరాలతో నిజామాబాద్ పోటీ పడడం నిజామాబాద్ వాసుల ప్రత్యేకత అని ఆమె అన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >