Posted on 2025-09-09 12:07:39
డైలీ భారత్, నార్సింగి: నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 4 లక్షల లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామానికి చెందిన వ్యక్తి ప్లాట్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ను క్లియర్ చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు మున్సిపల్ కార్యాలయంలో రెక్కీ వేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >