| Daily భారత్
Logo




పరీక్ష రాసేందుకు నిరాకరించిన ప్రొఫెసర్ పై కత్తితో దాడి చేసిన స్టూడెంట్

News

Posted on 2025-09-09 12:36:02

Share: Share


పరీక్ష రాసేందుకు నిరాకరించిన ప్రొఫెసర్ పై కత్తితో దాడి చేసిన స్టూడెంట్

డైలీ భారత్, నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎం.టెక్ (ట్రాన్స్‌పోర్ట్) విద్యార్థి మజ్జి వినాయక పురుషోత్తం, ఒక ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేయడంతో కళాశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సెకండ్ సెమిస్టర్ పరీక్షల సమయంలో ఈ ఘటన జరిగింది. విజయనగరానికి చెందిన పురుషోత్తం పరీక్ష రాయడానికి కళాశాలకు వచ్చినప్పటికీ, సరైన హాజరు లేకపోవడంతో సివిల్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ గోపాలరాజు అతడిని పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. హెచ్‌ఓడి అనుమతి తీసుకురావాలని సూచించినప్పటికీ, హెచ్‌ఓడి కూడా పరీక్ష రాయడానికి నిరాకరించారు. దీనికి ఆగ్రహం చెందిన పురుషోత్తం తిరిగి పరీక్షా కేంద్రానికి వచ్చి ప్రొఫెసర్ గోపాలరాజుతో వాగ్వాదం పెట్టుకున్నాడు.

వివాదం ఎక్కువ కావడంతో ప్రొఫెసర్ సెక్యూరిటీ సిబ్బందిని పిలవగా, పురుషోత్తం తన వెంట తీసుకువచ్చిన కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ దాడిలో గోపాలరాజుకు గాయాలు కావడంతో సహచర విద్యార్థులు అప్రమత్తమై దాడి చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ప్రొఫెసర్‌ను తక్షణం ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రకారం, నిందితుడు ముందుగానే రెండు కత్తులు తెచ్చుకోవడం వల్ల ఈ దాడి ప్రణాళికాబద్ధంగానే జరిగినట్లు తెలుస్తోంది. 70% హాజరు లేకపోవడంతో పరీక్షకు అనుమతి నిరాకరించడమే ఈ ఘటనకు కారణమని అధికారులు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, హింసతో సమస్యలు పరిష్కారం కాదని హెచ్చరించారు

Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >