| Daily భారత్
Logo




పేద విద్యార్థిని చదువుకు ప్రభుత్వం ఆర్థిక భరోసా

News

Posted on 2025-09-09 17:18:50

Share: Share


పేద విద్యార్థిని చదువుకు ప్రభుత్వం ఆర్థిక భరోసా

లక్ష రూపాయల చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పేద విద్యార్థిని చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది, చదువు మధ్యలో ఆగిపోకుండా కళాశాలలో చెల్లించాల్సిన ఫీజు కోసం ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 


తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడోజు ఆశ్రిత హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడవ తరగతి చదువుతుంది. కళాశాలలో ఫీజు చెల్లించేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఆర్థిక సహాయం చేయాలని హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించింది. స్పందించిన ప్రభుత్వం తగిన సహాయం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు సూచించారు. 

మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆశ్రిత తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఉన్నత విద్య అభ్యసించి, లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు చదువుకు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, సహకరించిన జిల్లా కలెక్టర్ కు ఆశ్రిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >
Image 1

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:21:35

Readmore >
Image 1

సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం

Posted On 2026-05-05 16:16:41

Readmore >