Posted on 2025-09-07 13:20:37
ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రతి సంవత్సరం జిల్లా కేంద్రంలోని జండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు ఆదివారం తో ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిశాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు నగరపుర వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర బాలాజీ నామ స్మరణతో జెండాను ఊరేగించి పూలాంగ్ సమీపంలో ప్రతిష్టించారు. గత 15 రోజులుగా నగరంలోని బాలజీ ఆలయంలో కొనసాగిన జాతర ఆదివారంతో ముగిసింది. వంశపారపర్యం అర్చకులు అజయ్ సంగ్వాయి, సంజయ్ సంగ్వాయి, విజయ్ సాంగ్వాయ్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభాయాత్ర పూలాంగ్ సమీపంలోకి తరలించడం ఆనవాయితీ. ఈసారి చంద్రగ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాను ఊరేగించారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ మీదుగా పూలాంగ్ బ్రిడ్జి సమీపంలో ప్రతిష్ఠించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో దర్శనానికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఆలయ చైర్మన్ ప్రమోద్, ఈవో వేణు పాల్గొన్నారు. ఇది ఇలాఉండగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా జాతర లో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండాను దర్శించుకున్నారు. సంప్రదాయంగా వస్తున్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >