| Daily భారత్
Logo




13 ఏండ్ల బాలుడు గుండెపోటు తో మృతి

News

Posted on 2023-12-26 03:57:34

Share: Share


13 ఏండ్ల బాలుడు గుండెపోటు తో మృతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:గుండెపోటు వచ్చి 13 ఏండ్ల బాలుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో సోమవారం సాయంత్రం జరిగింది.

నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్‌-సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జశ్వంత్‌, సుశాంత్‌(13) ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పనిచేస్తూ ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి స్తున్నారు.

జశ్వంత్‌ కోనరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతుండగా, సుశాంత్‌ ముస్తాబాద్‌ మండలంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

ఈ క్రమంలో క్రిస్మస్‌ పండుగ కోసం సుశాంత్‌ ఆదివారం హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంట్లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నాడు.

మధ్యాహ్నం ఛాతీలో నొప్పి వస్తున్నదని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా దవాఖనకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తుండగానే సుశాంత్‌ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్రిస్మస్‌ సంబురాలతో సంతోషం నిండాల్సిన వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొన్నది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ కేతిరెడ్డి అరుణ కోరారు.

Image 1

గ్రామ సభలతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీస్తారా..?

Posted On 2026-04-03 03:31:40

Readmore >
Image 1

మురికికాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Posted On 2026-04-03 03:29:16

Readmore >
Image 1

హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...

Posted On 2026-04-03 03:27:41

Readmore >
Image 1

దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు

Posted On 2026-04-03 03:25:40

Readmore >
Image 1

భద్రాచలం పాదయాత్రకు తరలి వెళ్లిన తల్లాడ మండలం నారాయణపురం భక్తులు

Posted On 2026-04-03 03:24:24

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదుట ప్రధాన రహదారి విస్తరణకు భూ మార్పిడిని వేగవంతం చేయండి

Posted On 2026-04-03 03:23:08

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ

Posted On 2026-04-03 03:21:28

Readmore >
Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా

Posted On 2026-04-02 16:04:30

Readmore >
Image 1

స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

Posted On 2026-04-02 14:57:47

Readmore >
Image 1

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు

Posted On 2026-04-02 14:47:44

Readmore >