Posted on 2023-12-25 12:40:24
డైలీ భారత్, నాగర్కర్నూల్:నాగర్ కర్నూల్ పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎలుక కారణంగా 40 రోజుల పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
పట్టణంలోని నాగనూల్ ప్రాంతంలో నివసించే శివ, లక్ష్మికళ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. శనివారం డిసెంబర్ 23 ఆర్డ రాత్రి నేలపై తల్లితో నిద్రిస్తున్న చిన్నారి ముక్కును ఎలుక కొరకింది. ఇది తల్లిదండ్రులు గమనించకపోవటంతో తీవ్ర రక్తస్రావమైంది.
శిశువు ఏడుపుతో నిద్రలేచిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే పట్టణ ఆసుపత్రికి తరలించారు. తరువాత పరిస్థితి విషమంగా ఉండటంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం సాయంత్రం చిన్నారి మృతి చెందింది దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం అక్కడున్నవారిచే కంటతడి పెట్టించింది.
ఎలుకల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. చిన్నారులు ఉన్న చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలుకలు, విషపురుగుల బారిన చిన్నారులు పడ కుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు....
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >