Posted on 2025-08-16 20:59:29
శ్రీకృష్ణుని వేషాధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని మారుతి నగర్ లో గల మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు మురళీకృష్ణ ఆలయ అర్చకులు వెంకటేశ్వరశర్మ, ఆలయ ఛైర్మన్ రాములు
తెలిపారు. శనివారం కృష్ణాష్టమి సందర్భంగా తెల్లవారుజామున నుండి స్వామివారికి పంచామృతాభిషేకాలు, హారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. అదేవిధంగా ఆదివారం ఉదయం 9 గంటలకు స్వామివారి పల్లకీ సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని ఆర్మూర్ రోడ్డు లో గల మురళీకృష్ణ ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ఉదయం నుంచే కృష్ణుడి ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. దీంతో కృష్ణుడి మందిరాలు కితకిత లాడాయి పలుచోట్ల చిన్నారులు శ్రీకృష్ణుని వేషాధారణతో ఆటల పోటీలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకృష్ణుని వేషాధారణతో చిన్ని చిన్ని చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోవైపు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >