Posted on 2025-08-11 20:28:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో, మార్వాడిగల్లీలోని తన నివాసంలో శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీ విశ్వనాథునికి భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో పది మంది ప్రముఖ వేద పండితులు పాల్గొని, శాస్త్రోక్తంగా మహాదేవునికి గంగాజలంతో, పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు " ఇందూర్ జిల్లా ప్రజల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి మరియు లోక కళ్యాణం కోసం ఈ రుద్రాభిషేకాన్ని గత 50 ఏళ్లనుండి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మన సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించడంతో పాటు మనశాంతి, దృఢ సంకల్పం కలుగుతుందన్నారు. మహాదేవుని ఆశీస్సులతో సమాజం శాంతిగా, సుసంపన్నంగా ఉండాలి. ప్రజలకు మంచి జరగాలని మనసారా కోరుకున్నట్లు" తెలిపారు. వేద ఘోషల నడుమ ఎంతో ఆధ్యాత్మికతతో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >