| Daily భారత్
Logo




రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ నరకయాతన.. మార్గమధ్యలోనే ప్రసవం

News

Posted on 2025-08-10 17:23:41

Share: Share


రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ నరకయాతన.. మార్గమధ్యలోనే ప్రసవం

డైలీ భారత్ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మున్యా నాయక్ తండా లోకి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. గ్రామానికి చెందిన ఒక యువతి గర్భం దాల్చింది.  అయితే  తండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు  కూడా సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ అష్ట కష్టాలు పడింది. దీంతో మధ్యలోనే ప్రసవించింది.

స్వాతంత్య్రభారతానికి 75 ఏళ్లు నిండాయి. ఇన్నేండ్లలో దేశాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రపంచ వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప దేశానికి ఆ పాలకులు చేసిన మేలంటూ ఏదీ లేదు. నాయకులు కోట్లకు అభివృద్ధి చెందారే తప్ప పేదలు పేదలుగానే మిగిలిపోయారు. ఈ దేశంలో నేటికి వేలాది గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవంటే మనమెంత పురోగమిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. నేటికి అనేక గ్రామాలకు రోడ్డు, విద్యుత్‌, తాగునీరు సౌకర్యాలు లేవన్నది జగమెరిగిన సత్యం. నేటికి అనేక గిరిజన గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వాగులు దాటుతున్నారంటే మనదేశం ఏ స్థితిలో ఉందో అంచనా వేయవచ్చు. 

దేశానికి స్వాతంత్య్రమే కాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి కూడ పదేండ్లు దాటింది. అయినా నేటికి అనేక గ్రామాలకు మౌళిక వసతులు లేవన్నది నిజం. నేటికి కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం అనేది నేటి మన పాలకుల ఘనమైన పాలనకు అద్ధం పడుతోంది. అనేక గిరిజన ప్రాంతాల్లో నేటికి రోడ్డు సౌకర్యం లేదు. అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. 

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లోనూ అలాంటి గ్రామాలున్నాయంటే అతిశయోక్తి కాదు.  తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలో మున్యా నాయక్ తండా ఒకటి. పేరుకే గ్రామం కానీ, ఆ తండాలోకి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీంతో ఈ రోజు ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువతి గర్భం దాల్చింది.  అయితే ఆమెకు డెలివరీ సమయం వచ్చి నొప్పులు పడుతుంది.  అయితే  తండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు  కూడా సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ అష్ట కష్టాలు పడింది.. ఆశా కార్యకర్తల సహాయంతో 2 కిలోమీటర్ల వరకు గర్భిణీని కుటుంబ సభ్యులు వీపుపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.  దీంతో  ఆమె సుమారు గంట పాటు నరకయాతన అనుభవించింది. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలోనే మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ లో నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆమెను ఆస్పత్రికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >