Posted on 2025-08-10 18:27:55
లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయం
ఏ గ్రామంలో చూపినా మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్నదే జనం ఆకాంక్ష
ఇకనుండి జిల్లాంతా తిరుగుతా, బీ ఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తా
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశా..
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల "పోరు" ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అఖండ విజయం సాధించి ప్రజాక్షేత్రంలో కేసీఆర్ మళ్ళీ హీరోగా నిలుస్తారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నందిపేట్ మండల పర్యటన సందర్భంగా కుద్వాన్ పూర్ వంతెనను జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హామీల అమలులో రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను చీటింగ్ చేయడంలో టాప్ లో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసి పోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఇంకా 30వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న జీవన్ రెడ్డి రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం నెలకొందన్నారు. రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి గ్రామాల్లో చెత్తా చెదారం, పందులు,దోమలు విహారం చేస్తూ వ్యాధులు ప్రబలుతున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
చెత్త తరలించే ట్రాక్టర్లు డీజిల్ లేక తుప్పు పడుతున్నాయని,
ప్రకృతి వనాలు పచ్చదనం పోయి ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ
తెలంగాణ కేసీఆర్ హయాంలో ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది అని ప్రశ్నించారు. ఈనగాచి నక్కలపాలు చేసినట్లయిందని,
పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని మండిపడ్డారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ కాంగ్రెస్, బీజేపీల పతనం షురూ అయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల పేరు వింటేనే ప్రజలు భగ్గుమంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని అన్ని గ్రామాలు నినదిస్తున్నాయన్నారు.
లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమన్నారు.
ఏ గ్రామంలో చూపినా మళ్ళీ కారు రావాలి, సారు రావాలి, కేసీఆర్ సీఎం కావాలి అన్నదే జనం ఆకాంక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పల్లె పల్లెలో, పట్టణాలలో మళ్ళీ గులాబీ జెండా రెపరెపలాడటం తథ్యమన్నారు. ఇకనుండి జిల్లాంతా తిరుగుతానని, బీ ఆర్ఎస్ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తానని ఆయన వెల్లడించారు. పదేళ్ళ బీ ఆర్ఎస్ పాలనలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు.
రూ.150 కోట్లతో పంచెగూడ వంతెన నిర్మాణం పూర్తి చేసి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గించిన ఘనత కేసీఆర్ దన్నారు.
మరో వంద కోట్లతో నియోజకవర్గం లోని పలు వంతెనలు నిర్మించిన కేసీఆర్ కు జీవన్ రెడ్డి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.
స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి ల మధ్య ప్రోటోకాల్ రగడ తప్ప వారు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం అని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన స్కీమ్ లకే కొబ్బరి కాయలు కొట్టడం, పాతగోడలకు సున్నాలు కొట్టి మందికి పుట్టిన బిడ్డ మా గొప్పేనని జబ్బలు చర్చుకోవడం తప్ప ఊడబోడిచిందేమీలేదని ఆయన ఎద్దేవా చేశారు. కుద్వాన్ పూర్ –కొండాపూర్ రోడ్డు వెంటనే వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి తాము శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు.
పదేళ్ళ తన శ్రమ, తనదైన మార్క్ అభివృద్ధి ఆర్మూర్ నియోజకవర్గానికి ల్యాండ్ మార్క్ గా జీవన్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ, కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామ న్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >