Posted on 2025-08-10 13:11:23
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ
డైలీ భారత్, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటు కోసం తెలంగాణ సైకాలజిస్టుల సంఘం (TPA) చేస్తున్న కృషికి ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు.
ఈ రోజు సిరిసిల్లలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కల్సి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సైకాలజిస్టు మండలి ఏర్పాటు కు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
TPA ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా సైకాలజిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, మండలి ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు.
ఈ సందర్భంగా మండలి ఏర్పాటుకు నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, అవసరమైన మద్దతు ఇస్తాను” అని హామీ ఇచ్చారు.
TPA ప్రధాన డిమాండ్లు ల ను గురించి సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుంట్ల పున్నంచందర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వివరించారు.
సైకాలజిస్టులకు చట్టబద్ధ గుర్తింపు & లైసెన్సింగ్ వ్యవస్థ
మానసిక ఆరోగ్య కేంద్రాలకు ప్రమాణపూర్వక నియంత్రణ
వృత్తి అభివృద్ధి కోసం నిరంతర శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం అవసరం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకుంట్ల పున్నంచందర్, జిల్లా అధ్యక్షుడు వై. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సి హెచ్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >