| Daily భారత్
Logo




"తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటుకు కృషి"

News

Posted on 2025-08-10 13:11:23

Share: Share


"తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటుకు కృషి"

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ

డైలీ భారత్, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటు కోసం తెలంగాణ సైకాలజిస్టుల సంఘం (TPA) చేస్తున్న కృషికి ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు.

ఈ రోజు సిరిసిల్లలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కల్సి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సైకాలజిస్టు మండలి ఏర్పాటు కు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

TPA ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా సైకాలజిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, మండలి ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు.

 ఈ సందర్భంగా మండలి ఏర్పాటుకు నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, అవసరమైన మద్దతు ఇస్తాను” అని హామీ ఇచ్చారు.

TPA ప్రధాన డిమాండ్లు ల ను గురించి  సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుంట్ల పున్నంచందర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వివరించారు.

సైకాలజిస్టులకు చట్టబద్ధ గుర్తింపు & లైసెన్సింగ్ వ్యవస్థ

మానసిక ఆరోగ్య కేంద్రాలకు ప్రమాణపూర్వక నియంత్రణ

వృత్తి అభివృద్ధి కోసం నిరంతర శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం అవసరం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకుంట్ల పున్నంచందర్, జిల్లా అధ్యక్షుడు వై. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సి హెచ్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >