Posted on 2025-08-10 16:41:23
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ
డైలీ భారత్, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల మండలి ఏర్పాటు కోసం తెలంగాణ సైకాలజిస్టుల సంఘం (TPA) చేస్తున్న కృషికి ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు.
ఈ రోజు సిరిసిల్లలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కల్సి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సైకాలజిస్టు మండలి ఏర్పాటు కు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
TPA ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా సైకాలజిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, మండలి ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు.
ఈ సందర్భంగా మండలి ఏర్పాటుకు నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, అవసరమైన మద్దతు ఇస్తాను” అని హామీ ఇచ్చారు.
TPA ప్రధాన డిమాండ్లు ల ను గురించి సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుంట్ల పున్నంచందర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వివరించారు.
సైకాలజిస్టులకు చట్టబద్ధ గుర్తింపు & లైసెన్సింగ్ వ్యవస్థ
మానసిక ఆరోగ్య కేంద్రాలకు ప్రమాణపూర్వక నియంత్రణ
వృత్తి అభివృద్ధి కోసం నిరంతర శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం అవసరం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకుంట్ల పున్నంచందర్, జిల్లా అధ్యక్షుడు వై. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సి హెచ్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >