Posted on 2025-08-06 18:32:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘo ఆధ్వర్యంలో స్థానిక కంటేశ్వర్ లో గల జయ శంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్టేట్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వడ్ల హన్మాండ్లు చారి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరంతరం కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ అని, వారి ఆశయ సాధనను ఆదర్శంగా తీసుకోవాలనీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంకు నీళ్ళు,నిధులు, నియామకాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధిలో తీవ్ర అన్యాయం జరుగుతుందని,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితేనే,మన నీళ్ళు, నిధులు, నియామకాలు మనకు ధక్కుతాయన్న సంకల్పంతో విద్యార్థి దశనుండి తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై బాల్యదశ నుండి వృద్ధాప్యం వరకు నిరంతరం శ్రమించిన గొప్ప మహానుభావులు ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ అని,విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించిన బీసీ ముద్దు బిడ్డ జయశంకర్ సార్,తెలంగాణకే,బీసీ కులానికే,విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణం అన్నారు.
కార్యక్రమంలో స్టేట్ క్యాషియర్ తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి బంధన కంటి నరసింహులు, నరసింహ చారి,కట్ల సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >