జిల్లా సహకార బ్యాంకు ద్వారా సహకార సంఘములకు డివిడెండ్ విడుదల
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల జరిగిన జిల్లా సహకార బ్యాంకు 103 వ వార్షిక మహాజన సందర్భముగా సహకార సంఘములకు డివిడెండ్ ప్రకటించి, ఖాతాలలో జమచేసినందుకు కృతజ్ఞత గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి ని కలిసి సన్మానించిన సహకార సంఘముల యూనియన్ నాయకులు.
ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ, బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి జిల్లా సహకార వ్యవస్థ అభివృద్ధికి అంకితభావంతో సేవలు అందిస్తూ, తన ఆలోచనలతో సహకార బ్యాంకు, సహకార సంఘములు అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ,అందరికీ ఆదర్శంగా నిలుస్తూ, తన నిర్ణయాలతో , ఖచ్చితత్వం తో బ్యాంకును వెన్నుతట్టుతూ, ఉద్యోగుల ను ప్రోత్సహిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ, సహకార బ్యాంకు నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించి, వీక్ బ్యాంక్ స్టేటస్ తొలగించి, ప్రస్తుతం రాష్ట్ర సహకార రంగం జిల్లా వైపు చూసేలా చేసి, గత 10 సంవత్సరములలో ఎన్నడూ లేని విధముగా సహకార సంఘములకు డివిడెండ్ ప్రకటించారు, ఇది వారి పనితీరుకు నిదర్శనం, వారి నాయకత్వం,నేతృత్వం,ప్రోత్సాహం మరియు నిత్యం ఉద్యోగులకు అందుబాటు లో ఎవరికీ ఆటంకం కలగకుండా జిల్లా సహకార రంగమునకు వారు ఎనలేని సేవ చేస్తున్నారని ఇంకనూ వారి నాయకత్వం లో మరిన్ని మైలురాళ్ళు చేరుకుంటామని, ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నల్ల చంద్రశేఖర్ రెడ్డి , డైరెక్టర్లు లింగయ్య , రమేష్ పాటిల్ , ,బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే పాల్గొన్నారు.