Posted on 2023-09-07 16:36:44
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి శాండీ రెడ్డి ని ఎన్నారై కోఆర్డీనేటర్ మహేష్ బిగాల అభినందించారు. ఇది తెలంగాణ ఆడపడుచుకు దక్కిన గౌరవం అని ప్రశంసించారు. సెప్టెంబర్ 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్గా ఎన్నికయ్యారని, కౌన్సిలర్గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి శాండీ రెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారని స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించారు.
ఆస్ట్రేలియాలోని పీవీ విగ్రహం వద్ద మహేష్ బిగాల తదితరులు
ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో శాండీ కౌన్సిలర్గా గెలుపొంది డిప్యూటీ మేయర్గా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. కాగా, సంధ్యా రెడ్డి శాండీ రెడ్డి కి 2020 సంవత్సరానికి స్ట్రాత్ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న సంధ్యారెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాక్షించారు
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >